- Advertisement -
మనసులోని భావాలను మనం వినేటట్లు వ్యక్తపరచుటకు.
సత్యాన్ని – అసత్యాన్ని స్పష్టంగా వెలికి తీయుటకు.
సమస్యలను సమాజానికి
తేటతెల్లంగా తెలియజేయుటకు.
జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందరితో పంచుకునేందుకు.
భిన్నాభిప్రాయాల మధ్య
అవగాహన వంతెనను నిర్మించేందుకు
వ్యక్తిగత, సామాజిక మార్పుల
పరిణామాలను విశ్లేషించేందుకు.
జోడు గుర్రాల్ల జీవిత సమరాన్ని అజేయంగా గెలిచేందుకు!
- డా మైలవరం చంద్ర శేఖర్, 8187056918
- Advertisement -