కేటీఆర్కు చామల కిరణ్కుమార్రెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ నోటీసులిస్తే ఎందుకు ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు. డ్రగ్స్్ కేసులో డ్రగ్ పరీక్ష చేయించుకోవాలంటూ ఆనాడు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్రెడ్డి ప్రశ్నిస్తే ఎందుకు చేయించుకోలేదని విమర్శించారు. ఆయనకు ఆయనే లై డిటెక్టర్ పెట్టుకుంటే ఇక కోర్టులెందుకని నిలదీశారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్కు ఇంగ్లీష్ ఫుల్… సబ్జెక్టు నిల్ అని ఎద్దేవా చేశారు. ఈ కార్ రేసులో పాలనా అనుమతులు లేకుండా రూ.44 కోట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అదే విషయాన్ని ఏసీబీ ప్రశ్నిస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తనను విచారణ చేయడమే తప్పు అన్నట్టు కేటీఆర్ మాట్లాడటం తగదన్నారు.
మహేష్కుమార్తో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
కొత్తగా మంత్రి పదవి దక్కించుకున్న వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్ను కలిశారు. ఈ సంద ర్భంగా శ్రీహరిని ఆయన శాలువా కప్పి అభినం దించారు. అనంతరం వాకిటి మాట్లాడుతూ మంత్రిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహి స్తామన్నారు. తనకు మంత్రి పదవి రావడానికి మద్దతు తెలిపిన మహబూబ్నగర్ ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఏసీబీ నోటీసులిస్తే అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES