- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలంలో గత వారం రోజులుగా కీటక జనిత వ్యాధులపై వైద్య అధికారులు విస్తృత ప్రచారం ఒకవైపున చేస్తూ ఉండగా, సాటాపూర్ గ్రామంలోని ఉపకేంద్రం ఆవరణ దోమలకు నిలయంట మారింది. ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చే రోగులకు ముందుగా ఈ అపరిశుభ్రత దర్శనమవుతుంది. ఫ్రైడే డ్రై డేగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటి తొట్టిలను శుభ్రం చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్న వైద్య అధికారులకు ఆరోగ్య ఉపకేంద్రం ఎదుటనున్న ఈ మురికి గుంట వారికి కనపడకపోవడం శోచనీయమని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ముందుగా ఈ ఉపకేంద్రం ఆవరణలోనున్న గుంటలను మొరంతో పూడ్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -