- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్ : మండల కేంద్రంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వన బోజనలకు గ్రామస్తులు ఆదివారం వెళ్ళారు. ఈ సందర్భంగా పస్కా రాజులకు యతలను బలి ఇచ్చారు. వర్షాలు సంవృద్ధిగా కురవాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. గుట్ట ప్రాంతానికి వెళ్లి వంటలు చేసుకొని పచ్చని గుట్టలో భోజనాలు చేశారు. పిల్లలతో ఆహ్లాద వాతావరణంలో గడిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -