నేటి నుంచి తైపీ ఓపెన్
తైపీ (తైవాన్) : ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఏమాత్రం కలిసి రావటం లేదు. ఫామ్లో ఉన్న షట్లర్లు గాయాలతో దూరమవుతూ ఉండగా.. అగ్రశ్రేణి షట్లర్లు పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నారు. సుదిర్మన్ కప్లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమంచిన టీమ్ ఇండియా షట్లర్లు నేటి నుంచి ఆరంభం కానున్న తైపీ ఓపెన్లో మెరవాలని చూస్తున్నారు. పురుషుల సింగిల్స్లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ సహా తరుణ్ మానెపల్లి, అయుశ్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్, లువాంగ్, శంకర్ ముతుస్వామి సుబ్రమణియంలు బరిలో నిలిచారు. లక్ష్యసేన్, హెచ్.ఎస్ ప్రణరులు తైపీ ఓపెన్ నుంచి దూరంగా ఉన్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో అనుపమ ఉపాధ్యాయ, రక్షిత శ్రీ సంతోశ్ రామ్రాజ్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా, అన్మోల్ ఖార్బ్లు పోటీపడుతున్నారు. మహిళల డబుల్స్లో రష్మి గణేశ్, సానియా సికందర్ జోడీ బరిలో నిలిచింది.
నేటి నుంచి అర్హత మ్యాచులు ఆరంభం కానుండగా.. ఆర్యమాన్, మన్రాజ్ సింగ్, మిథున్ మంజునాథ్, రఘు మారిసామి (పురుషుల సింగిల్స్)..శ్రేయ, ఐరా శర్మ, మాన్షి సింగ్, ఇషారాణి (మహిళల సింగిల్స్) పోటీపడనున్నారు. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు తైపీ ఓపెన్లో పోటీపడటం లేదు. ఇటీవల సుదిర్మన్ కప్లో పి.వి సింధు తలపడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఇక్కడైనా మెరుస్తారా?
- Advertisement -
- Advertisement -