– రాజస్థాన్తో హైదరాబాద్ రంజీ పోరు
జైపూర్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయంపై కన్నేసింది. గత మ్యాచ్లో పుదుచ్చేరిపై ఇన్నింగ్స్ విజయం సాధించిన ఉత్సాహంలో నేడు రాజస్థాన్తో తలపడేందుకు సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ తిలక్ వర్మ లేకుండానే నాల్గో మ్యాచ్లో ఆడుతున్న హైదరాబాద్కు రాహుల్ సింగ్, తన్మరు అగర్వాల్, హిమతేజ, సివి మిలింద్, తనరు త్యాగరాజన్లు కీలకం కానున్నారు. ఎలైట్ గ్రూప్-బిలో రాజస్థాన్, హైదరాబాద్ గత మూడు మ్యాచుల్లో పుదుచ్చేరి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్తో తలపడ్డాయి. రాజస్థాన్ ఓ విజయం, రెండు డ్రాలతో ఉండగా.. హైదరాబాద్ రెండింట ఓడి, ఓ విజయం సాధించింది.