- Advertisement -
మహీంద్ర యూనివర్విటీ టీటీ పోటీలు
హైదరాబాద్ : మహీంద్ర యూనివర్శిటీ టేబుల్ టెన్నిస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ విజేతగా సీబీఐటీ (చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నిలిచింది. బాయ్స్ టీమ్ చాంపియన్షిప్ విభాగంలో క్వార్టర్స్లో బిట్స్, సెమీస్లో మెథడిస్ట్ కాలేజ్ను ఓడించిన సీబీఐటీ.. ఆదివారం జరిగిన ఫైనల్లో మహీంద్ర యూనివర్శిటీపై 3-1తో గెలుపొందింది. సీబీఐటీ నుంచి సచిన్ 3-1తో సాద్విక్పై, ప్రతమ్ దేవ్ 3-2తో రోహిత్పై, ప్రతమ్ దేవ్ 3-0తో సాద్విక్పై నెగ్గగా.. రోహిత్, అక్షయ్ లు డబుల్స్లో ప్రతమ్, ప్రతీక్లపై 3-1తో నెగ్గి మహీంద్ర యూనివర్శిటీకి ఊరట అందించారు.
- Advertisement -


