ఖజానాలోకి రూ.700 కోట్లు!
జులై 1 నుంచి షురూ చార్జీల
పెంచేెందుకు రంగం సిద్ధం
నింపుకోవడమే లక్ష్యం
దేశ ప్రజలపై మోడీ సర్కారు మరో భారం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్యుడిపై మరో భారం మోపటానికి సిద్ధమవుతున్నది. రైల్వే టిక్కెట్ ధరలను పెంచనుంది. జులై1 నుంచి దీనిని అమల్లోకి తీసుకురానుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.700 కోట్లు రాబట్టే లక్ష్యంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రజల నడ్డి విరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న ధరలు, పెరగని జీతాలతో సతమతమవుతున్న దేశంలోని సాధారణ మధ్యతరగతి ప్రజలకు రైల్వే ప్రయాణ చార్జీల పెంపుదల మరో అదనపు భారం కానున్నదని విశ్లేషకులు, నిపుణుల హెచ్చరిస్తున్నారు.
టిక్కెట్ ధరల పెంపు ఇలా..!
ఆదాయం పెంపుదలపై దృష్టి పెట్టిన రైల్వే.. ప్రయాణికుల విభాగం నుంచి దానిని రాబట్టేం దుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఏసీ తరగతులు, స్లీపర్ క్లాస్, రెండో తరగతి చార్జీలను పెంచే అవకాశం కనిపిస్తున్నది. అయితే, సబర్బన్ చార్జీలు, నెలవారీ సీజన్ టిక్కెట్లలో ఎలాంటి పెరుగుదలా ఉండదని తెలిసింది. చార్జీల పెంపుదల విషయంలో ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ను జారీ చేయవచ్చని ఒక అధికారి తెలిపారు. ఏసీ తరగతులకు, కిలోమీటరుకు రెండు పైసలు, నాన్-ఏసీ (మెయిల్, ఎక్స్ప్రెస్) స్లీపర్ క్లాస్కు ఒక పైసా, 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు సెకండ్ క్లాస్ (జనరల్ క్లాస్)కు కిలోమీటరుకు అర పైసా పెరుగుదల ఉండొచ్చని వివరించారు. జులై నుంచి అమలు కానున్న ఈ చార్జీల పెంపుతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో మిగిలి ఉన్న కాలానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం రావచ్చని గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
ప్యాసింజర్ విభాగం నుంచి 30 శాతం ఆదాయం
రైల్వేలు తమ మొత్తం ఆదాయంలో దాదాపు 65 శాతం సరకు రవాణా ద్వారా గడిస్తాయి. ప్యాసింజర్ విభాగం నుంచి 30 శాతం ఉంటే.. మిగిలినది వివిధ వనరుల ద్వారా వచ్చి చేరుతుంది. ఇక ఈ ప్యాసింజర్ విభాగంలో, ప్రీమియం ఏసీ క్లాస్లు (ఏసీ మొదటి తరగతి, ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, ఏసీ చైర్ కార్) మొత్తం 54 శాతం ప్యాసింజర్ రెవెన్యూలను తెచ్చిపెడతాయి. అయితే, ప్రయాణికుల సంఖ్య విషయంలో మాత్రం దీని వాటా 4.8 శాతమే. ఇక స్లీపర్, జనరల్ క్లాసెస్ నుంచి దాదాపు 37 శాతం ఆదాయం వస్తుంది. అయితే, ప్రయాణికుల వాటా అత్యధికంగా 57 శాతంగా ఉండటం గమనార్హం.
ఆదాయం రూ.92,800 కోట్లుగా అంచనా
రైల్వే గణాంకాల ప్రకారం.. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందనే ఊహాగానాల ఆధారంగా 2026 ఆర్థిక సంవత్సరానికి ప్యాసింజర్ విభాగం నుంచి మొత్తం అంచనా వేసిన ఆదాయం రూ.92,800 కోట్లుగా ఉన్నది. 2025 ఆర్థిక సంవత్సరానికి చూస్తే.. 736 కోట్ల మందికి పైగా రైళ్లలో ప్రయాణించారు. దీంతో రైల్వేకు రూ.75,215 కోట్ల ప్యాసింజర్ రెవెన్యూ వచ్చింది.
2020లో ధరల పెంపు.. మళ్లీ ఇప్పుడు
రైల్వే టిక్కెట్ ధరలు దాదాపు ఐదేండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పెరిగాయి. ప్రయాణికుల చార్జీలు చివరగా జనవరి, 2020లో సవరించారు. నాన్-ఏసీ క్లాస్ (మెయిల్,ఎక్స్ప్రెస్) ధరలను రైల్వే పెంచింది. తరగతులను బట్టి కిలోమీటరుకు ఒక పైసా నుంచి నాలుగు పెసల వరకు పెంచారు.
రైల్వే చార్జీల పెంపుతో
- Advertisement -
- Advertisement -