నవతెలంగాణ – నకిరేకల్
మండలంలో ఓగోడు మాదారం రహదారి లో గుర్తుతెలియని వ్యక్తి మహిళపై దాడి చేసి బంగారు గొలుసు అపహరించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన ఆవుల సావిత్రమ్మ(60) తన భూమికి సంబంధించిన పని నిమిత్తం శాలిగౌరారం మండలం మాద వరం గ్రామానికి వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తి స్కూటీపై లిఫ్టు ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆమెను స్కూటీపై ఎక్కించుకొని మార్గమధ్యలో ఆపి ఆమెపై దాడి చేశాడు. ఆమె వద్ద ఉన్న ఐదు తులాల బంగారు గొలుసు దోచుకెళ్లాడు. ఈ ఘటనలో ఆవుల సావిత్రమ్మకు గాయాలు కావడంతో ఆమెను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై దాడి చేసి బంగారు గొలుసు అపహరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES