మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
నవతెలంగాణ – ఆలేరు టౌన్
మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం నవతెలంగాణ దినపత్రికతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రంగాలలో మహిళలు పాలుపంచుకుంటున్నారని, భూమి మొదలుకొని అంతరిక్షం వరకు అన్ని రంగాలలో తమదైన శైలిలో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 33% శాతం రిజర్వేషన్లు కల్పించారని, మహిళలు ఎదిగేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా, రాష్ట్ర, దేశ ప్రగతికి ఉంటుందని అన్నారు.



