నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో మహిళా సాధికారితపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి జిల్లా జడ్జి నాగరాణి పాల్గొని మహిళలకు భారత రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులపై, చట్టాలపై మాట్లాడుతూ.. వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అరాచకాలు, గృహహింస చట్టం, బాల్య వివాహాల నివారణ, ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాలపై విపులంగా వివరించారు. మహిళలు చట్టపరమైన అవగాహనతో ముందుకు సాగితే సమాజంలో సమానత్వం సాధ్యమని జడ్జి నాగరాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు తులసి, శారదా, తహసిల్దార్ రేణుక చహన్, ఎంపీడీఓ రాజేశ్వర్, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జిల్లా జడ్జి నాగరాణి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES