బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు : మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామానికి చెందిన బంధం చెరువు కట్ట గండి పనులు ప్రారంభిస్తున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి తెలిపాడు. సోమవారం ఎఫ్డిఆర్ నిధులు అయినా మూడు లక్షల రూపాయలతో ఈ, ఈ యాదగిరి, డి ఈ రామదాస్, ఏ ఈ సుష్మ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అకాల వర్షంతో కురిసిన వానలకు పార్వతమ్మ గూడెం గ్రామానికి చెందిన బంధం చెరువు కట్ట తెగిపోవడంతో ఇబ్బందులు అయ్యాయని అన్నారు. రైతులు ఇబ్బంది పడవద్దు రాకపోకలకు కూడా ప్రజలు ఇబ్బందులు పడవద్దు అనే ఉద్దేశంతో ఈ గండిని పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని శ్రీపాల్ రెడ్డి, మాజీ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి మాజీ ఉపసర్పంచ్ నిదానపల్లి ప్రవీణ్, మాజీ వార్డ్ సభ్యులు తోట యాకన్న ముదిరాజ్,మండల అధికార ప్రతినిధి మట్ట వెంకట రెడ్డి గారు,పెరుమాండ్ల జగన్ రైతులు తదితరులు ఉన్నారు.
బంధం చెరువుకట్ట గండి పనులు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES