- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు గురువారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆశ అంగన్వాడి, గ్రామపంచాయతీ, భవన నిర్మాణ కార్మికులు, హమాలి వ్యవసాయ కార్మికులు రైతు సంఘం మెడికల్ అండ్ హెల్త్ రంగాలకు సంబంధించిన కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల మెడకు ఉరితాలుగా మార్చారని సమ్మె చేసే హక్కు లేకుండా కేంద్రంలోని ఎన్డీఏ బిజెపి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాహసిల్దార్ సృజన్ కుమార్ కు అందించారు.
- Advertisement -



