- Advertisement -
కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు, పాలకవర్గం సంయుక్తంగా కృషి చేస్తోందని మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ అన్నారు. శనివారం సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నారు. అలాగే గ్రామంలో డ్రైనేజీల శుభ్రం, విధిద్విపాల ఏర్పాటు, పారిశుద్ధ్య తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యులు, అంగన్ వాడి టీచర్లు, స్వశక్తి మహిళలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



