- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, నిజామాబాదు, ఎన్వీరానంమెంటల్ ఇంజనీర్ జి. లక్ష్మణ్ ప్రసాద్, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆద్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతం చేద్దాం అనే థీమ్ ను యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన నేపద్యంలో భూమి, నీరు, వాయు సంరక్షణ, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం, మొక్కలు నాటడడం ద్వారా పచ్చదనం పెంచడం వంటి కార్యక్రమాల వలన కాలుష్యాన్నితగ్గించవచ్చని, ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
- Advertisement -