ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్ : భారత ఓపెనర్, స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన 2019 తర్వాతి తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కించుకుంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికాపై 51, ఫైనల్లో శ్రీలంకపై 116 పరుగులతో చెలరేగిన మంధాన..727 రేటింగ్ పాయింట్లు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ ముంగిట మంధాన మళ్లీ వరల్డ్ నం.1 బ్యాటర్గా నిలువటం విశేషం. దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా అగ్రస్థానం కోల్పోయి.. ఇంగ్లాండ్ క్రికెటర్ నటాలీ సీవర్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆమీ జోన్స్ (ఇంగ్లాండ్), ఎలిసి పెర్రీ (ఆస్ట్రేలియా) టాప్-5లో నిలిచారు. భారత బ్యాటర్లు జెమీమా రొడ్రిగస్, హర్మన్ప్రీత్ కౌర్లు వరుసగా 15, 16వ స్థానాల్లో నిలిచారు. బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ (672) నాల్గో స్థానంలో కొనసాగుతుంది. సోఫీ ఎకెల్స్టోన్ (ఇంగ్లాండ్) అగ్రస్థానంలో నిలువగా.. ఆసీస్ అమ్మాయిలు ఆశ్ గార్డ్నర్, మేఘన్ స్కట్లు 2,3వ స్థానాల్లో ఉన్నారు. ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా (167) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ (128) రెండో స్థానంలో నిలిచింది. భారత్ (121), న్యూజిలాండ్ (96), దక్షిణాఫ్రికా (89) టాప్-5లో ఉన్నాయి.
వరల్డ్ నం.1 మంధాన
- Advertisement -
- Advertisement -