– లక్ష్మీనారాయణ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆర్య వైశ్య నేతల పిలుపు
నవతెలంగాణ – కామారెడ్డి
ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా అమరవాది లక్ష్మీనారాయణ భారీ మెజారిటీతో గెలువాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కన్యాకాపరమేశ్వరి అమ్మవారికి ఆర్య వైశ్య సంఘ సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
ఈ కార్యక్రమం ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ నాయకత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వంలో మహాసభ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో హైదరాబాద్లో జరిగే ఎన్నికల్లో ఆయనకు పూర్తి మద్దతు తెలుపుతూ “జై అమరవాది… జై జై అమరవాది” నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్య వైశ్య ఈసీ సభ్యులు, సంఘానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.



