Sunday, June 1, 2025
E-PAPER
Homeసినిమాభిన్న పాయింట్‌తో 'యముడు'

భిన్న పాయింట్‌తో ‘యముడు’

- Advertisement -

జగన్నాథ పిక్చర్స్‌ పతాకంపై జగదీష్‌ ఆమంచి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హీరో నవీన్‌ చంద్ర రిలీజ్‌ చేశారు. ఇదొక మైథలాజికల్‌, సస్పెన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్‌ మూవీ అని టీజర్‌ చూస్తే అర్థం అవుతుంది. సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్‌ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్టుగా టీజర్‌ను కట్‌ చేశారు. యముడు భూలోకంకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తాడేమో అన్నట్టుగా కనిపిస్తోంది. ‘ధర్మంతు సాక్షాత్‌ భగవత్‌ ప్రణీతం’ అనే డైలాగ్‌ చూస్తుంటే, ఈ సినిమా హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దక్పథాన్ని చూపించబోతుందన్న ఆసక్తి కలుగుతుంది. హిందు ధర్మం నుంచి ఓ కొత్త పాయింట్‌తో ఆసక్తికరంగా సినిమాను మలిచినట్టు అనిపిస్తుంది. టీజర్‌లో విష్ణు రెడ్డి వంగా కెమెరా వర్క్‌, భవాని రాకేష్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మరింత ప్రభావవంతంగా ఉంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి కథ, దర్శకుడు, నిర్మాత : జగదీష్‌ ఆమంచి, రైటర్‌ : హరి అల్లసాని, జగదీష్‌ ఆమంచి, స్క్రీన్‌ ప్లే : శివ కుండ్రపు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : రజిని ఆమంచి, ఎడిటర్‌:: కెసిబి హరి, డిఓపి : విష్ణు రెడ్డి వంగా, సంగీతం : భవాని రాకేష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -