Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కెపిసి సంస్థకు వార్నింగ్ ఇచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే..

కెపిసి సంస్థకు వార్నింగ్ ఇచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: బుధవారం రోజు కే పి సి సంస్థ నిర్లక్ష్యంతో ఎల్లారెడ్డి మండలం మల్లయ్య పల్లి వద్ద నాగిరెడ్డిపేట్ మండలం మాల్ తుమ్మెద వద్ద ప్రమాదాలు జరగడంతో అందులో మల్లేపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం పై కెపిసి సంస్థ పై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి తెలిపారు. మల్లేపల్లి ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అదేవిధంగా మాల్ తుమ్మెద మద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దిగంబర్ శర్మకు అన్ని రకాలుగా చికిత్సలు దగ్గరుండి  చేయిస్తానని ఎమ్మెల్యే తెలిపినట్లు  రామచంద్రారెడ్డి తెలిపారు. పనుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి సక్రమంగా పని నిర్వహించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -