- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లొ యోగా డే నిర్వహించారు. ఈ క్రమంలో ఎస్సై గుండెల రాజు ఆధ్వర్యంలో సిబ్బంది తో కలిసి యోగా కార్యక్రమాలు చేసి సిబ్బందికి ఆరోగ్యం పట్ల, యోగ మన జీవన విధానంలో భాగం కావాలని ప్రతి రోజు యోగాతో శారీరక మానసిక, ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు. యోగా సాధనతో జీవితం సమతుల్యమవుతుందని, లక్ష్యసాధన కోసం కావాల్సిన ఏకాగ్రత యోగాతో వస్తుందన్నారు.
- Advertisement -