నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం ఆవరణలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రకృతి వైద్యాధికారి డాక్టర్ దేవయ్య యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నిద్రకు ఉపయుక్తమైన చిట్కాలు, కోపం తగ్గించే ప్రాణాయామాలు, పని ఒత్తిడిని తగ్గించే యోగాసనాలపై విశదంగా వివరించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలనీ, ఇది శారీరక-మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, డీఈఎంవో వేణుగోపాల్, హెచ్ ఈ ఓ చలపతి, ఎన్ హెచ్ ఎం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పద్మజ, యోగ శిక్షకులు లింగమూర్తి, సూపరింటెండెంట్ , కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యోగా దినోత్సవం.. అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES