Friday, June 20, 2025
E-PAPER
Homeజిల్లాలుస్నేహ సొసైటీలో ఘనంగా యోగా దినోత్సవం 

స్నేహ సొసైటీలో ఘనంగా యోగా దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక దివ్యాంగులు అయినప్పటికీ విద్యార్థులందరూ సుమారు 30 ఆసనాలకు సకలాంగులకు దీటుగా ప్రదర్శించారు. విద్యార్థులు వేస్తున్న ఆసనాలను చూసి ఆశ్చర్యచక్తులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మాట్లాడుతూ.. మన పురాతన కాలం నుండి యోగా అనేది చాలా ప్రాముఖ్యత కూడుకున్నదన్నారు. పురాతన కాలంలో యోగ మరియు శరీర అవయవాలు కదలికకు అనుగుణంగా పనిచేయడం ద్వారా ప్రశాంతమైన జీవితం కొనసాగేదన్నారు. అలాగే కనీసం మందులు కూడా చాలా తక్కువగా వాడే వారన్నారు. ఆ మందులు సైతం చెట్ల మూలికలతో ప్రాచీన ఆయుర్వేద ఔషధాలతో ఎంతటి పెద్ద వ్యాధినైనా అధిగమించి ఎన్నో సంవత్సరాలు కాలం వెళ్లదీసే వారన్నారు. కానీ ప్రస్తుత తరుణంలో ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎక్కువగా మందులు వాడడం జరుగుతుందన్నారు.

కెమికల్స్ తో కూడిన మందులతో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. కానీ ప్రాచీన వైద్యము యోగాతో మానసిక ప్రశాంతత శరీర అవయవాలు కదలిక మరియు నాడీ వ్యవస్థ ప్రతి ఒక్కటి ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలు వారిని అసలు దివ్యాంగులు అనే పదం వాడకుండా విద్యార్థులను స్నేహ సొసైటీ నిర్వాహకులు ఎస్ సిద్దయ్య, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ ఎస్.జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, యోగ ఉపాధ్యాయురాలు వీణా, సిబ్బంది అన్ని రంగాల్లో రాణించేందుకు వారిని ఎంత అభినందించిన తక్కువేనని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజికన్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 సంవత్సరంలో హైదరాబాద్ కనహ శాంతి వనంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 20 మంది మానసిక వికలాంగులు పాల్గొనడం ఆ సంవత్సరంలో సామాజిక న్యాయ మరియు సాధికారిక మంత్రిత్వ శాఖకు లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు రావడం చాలా సంతో చించ దగ్గ విషయం అన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 17 మంది పిల్లలు అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొనడం ఎంతో శుభ పరిణామం అన్నారు.

ప్రతి ఒక్కరు తమ పిల్లలు దివ్యాంగులైనసకలంగులైన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను వారిని ప్రోత్సహించినప్పుడు వారి నడవడికను గమనిస్తూ వారికి అనుగుణంగా మలుచుకుంటూ వెళ్తే వారు ఎన్నో విజయాలు సాధించగలుగుతారని తెలిపారు. అనంతరం స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక స్థాయికి రావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం జిల్లా పాలన యంత్రాంగం జిల్లా కలెక్టర్, న్యాయమూర్తులు, అలాగే జిల్లా సంక్షేమ అధికారి, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి సహకారంతోనే పిల్లలు రాణించగలుగుతున్నారని తెలిపారు. అలాగే స్నేహ సొసైటీ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతోనే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడంలో ప్రతి ఒక్కరి కృషి దాగి ఉందని అభినందించారు. ఈ యోగా కార్యక్రమంలో అందుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -