Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం 

ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను (దశాబ్ది ఉత్సవాలు)కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక భూమి – ఒక ఆరోగ్యం కోసం యోగ అనే నినాదంతో జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణం లోని శ్రీరామ గార్డెన్ లో ఘనంగా నిర్వహించినట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె.గంగాదాస్ తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా అధికారులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, జిల్లా క్రీడల అధికారి,జిల్లా యోగ అసోసియేషన్ ప్రతినిధులు, భారత స్వాభిమాను ట్రస్ట్, పతంజలి ప్రతినిధులు , ఆయుష్మన్ యోగ థెరపీ, ఆరోగ్య రక్ష, జె సి ఐ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యోగ గురువులు, యోగ సాధకులు , సీనియర్ సిటిజన్ ప్రతినిధులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ప్రజలు, విద్యార్థి, విద్యార్థినిలు పాల్గొన్నారు.

మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గౌరవ ఎంఎల్ఏ  మాట్లాడుతూ.. నిత్యం యోగ సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని, మారుతున్న జీవన విధానం లో యోగ చాలా బాగా ఉపయోగ పడుతుంది అని వివరించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు అందరూ నిత్యం యోగ సాధన చేయాలని, యోగ చక్కటి మార్గమని యోగ సాధన చేయడం ద్వారా మధు మెహం, రక్త పోటు వ్యాధులను నివారిస్తుంది అని తెలిపారు.విద్యార్థి నుల యోగ విన్యాసాలు అందరిని ఆకట్టు కున్నాయి. ఈ కార్య క్రమం లో అడిషనల్ సీపీ బస్వరెడ్డి, అడిషనల్ సిపి రామచందర్ లు, రెడ్ క్రాస్ ప్రతినిధులు తోట రాజశేఖర్, బూస ఆంజనేయులు, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజశ్రీ, సంక్షేమ అధికారి రసూల్ బి, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు సుదం లక్మిగారు,మాజీ ఎంఎల్ఏ యెండల లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా,జిల్లా యోగ అసోసియేషన్ ప్రతినిధులు యోగ రామచందర్ యోగ ప్రభాకర్, యోగ సంగీత , బాల శేఖర్, డాక్టరు ఫసి యొద్దిన్,డాక్టర్ తిరుపతి, డి పి ఎం వందన రెడ్డి, ఆయుష్ ఫార్మ సి స్ట్ లు పురు షో తం , ఉమప్రసాద్, ఆయుష్ విభాగం ఉద్యోగులు.యోగ శిక్షకులు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేశారు..స్వచ్ఛంద సంస్థలు రెడ్ క్రాస్, రిలయన్స్,అల్ట్రా టెక్ సిమెంట్ ప్రతినిధులు రాగి అంబలి, పండ్లు, నీళ్లు అందించారు. విద్యార్థి, విద్యార్థినిలకు బహుమతులు అందచేసి ముఖ్యులకు సన్మానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -