Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలి: కలెక్టర్

దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలి: కలెక్టర్

- Advertisement -

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
: ఆరోగ్యవంతమైనా సమాజం కోసం ప్రజలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరెట్ కార్యాలయ ఆవరణం లోని గార్డెన్ లో నిర్వహించిన 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదిదుకుల ఒత్తిడిలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి యోగా సాధన ఉపశమనంలా ఉంటుందని, ప్రతి రోజు యోగా సాధన ద్వారా ఒత్తిడి దూరమవుతుందని, దీర్ఘాకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని అన్నారు. ప్రజలందరికి యోగా డె శుభాకాంక్షలు తేలిపారు. ప్రజలు మానసిక ఒత్తిడి వల్ల బిపి, షుగర్, థైరాయిడ్, అస్తమా లాంటి ఆనారోగ్య సమస్యలు ఎదురుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం యోగా, ధ్యానం చేయాలనీ సూచించారు.ప్రతి రోజు క్రమం తప్పకుండ యోగా చేయటం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని, రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలని ఆదిగమించవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమం లో డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ పి చంద్రశేఖర్, ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ రామకృష్ణ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ కుమార్, కరుణాకర్ రెడ్డి,పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -