కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన హై-ఓక్టేన్ గ్యాంగ్స్టర్ డ్రామా ‘థగ్లైఫ్’ నేడు (గురువారం) థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. కమల్ హాసన్, మణిరత్నం వంటి హేమాహేమీలు 38 ఏళ్ల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలిసి ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నాయకుడు’ సినిమా ఓ చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్కి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. టీజర్, ట్రైలర్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు చార్ట్బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని శింబు, అశోక్ సెల్వన్, త్రిష కష్ణన్, అభిరామి లాంటి స్టార్ తారాగణం కీలక పాత్రలు పోషించడం మరింత ఆసక్తిని పెంచింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాకు సాలిడ్ బజ్ ఉంది. హీరో నితిన్ ఫాదర్ ఎన్.సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో ‘విక్రమ్, అమరన్’ లాంటి బ్లాక్బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ని గ్రాండ్గా విడుదల చేస్తోంది. ఈ సినిమాతో మరోమారు కమల్హాసన్ నట విశ్వరూపం చూడబోతున్నారని మేకర్స్ దీమా వ్యక్తం చేశారు.