Tuesday, June 10, 2025
E-PAPER
Homeకరీంనగర్ఆన్ లైన్ బెట్టింగ్ కు యువకుడు బలి...

ఆన్ లైన్ బెట్టింగ్ కు యువకుడు బలి…

- Advertisement -

ఉరివేసుకొని ఆత్మహత్య…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
: ఆన్ లైన్ బెట్టింగుకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంగళ్ళపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన విరాల ప్రకారం… మండలంలోని దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) అనే యువకుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి కరీంనగర్ పట్టణంలో కార్ మెకానిక్ పనిచేస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడి ఆన్లైన్ గేమ్లు ఆడుతుండేవాడు. ఆ ఆన్లైన్ గేమ్ల ద్వారా సుమారుగా రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడని మృతుడి తండ్రి శ్రీనివాస్ తెలిపాడు. అంతేకాకుండా చేసిన అప్పులను తీర్చేందుకు స్నేహితుల వద్ద, తెలిసిన వారి వద్ద నుండి అప్పులు చేసి మరింత మొత్తంలో ఆన్లైన్ గేమ్లు ఆడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు బాగా చేయడంతో విషయం కాస్త ఇంట్లో తెలవగా తల్లిదండ్రులు అతన్ని మందలిచ్చినట్లు తెలిపారు. సోమవారం ఉదయం పొలంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -