- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
బస్సు ఢీ కొని ద్విచక్ర వాహనదారునికి గాయాలైన ఘటన మండలంలోని మాణిక్ బండర్ ( చెక్క) చౌరస్తా వద్ద గురువారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మానిక్ బండారు తండాకు చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి తన ద్వి చక్ర వాహనం పై మాణిక్ బండర్ నుండి దాస్ నగర్ వస్తున్న క్రమంలో నిజామాబాద్ నుండి ఆర్మూర్ వైపు వెళ్తున్న బస్సు వెనుక భాగం ద్విచక్ర వాహనానికి తగలడంతో క్రిందా పడ్డాడు. దింతో అతనికి గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -