- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం యాదగిరిగుట్టలో బొమ్మలరామారం మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారం గణేష్,సంగి పరశురాములు రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఆలేరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని, స్థానిక ఎలక్షన్లో యువత సిద్ధం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుధీర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన్నె శ్రీధర్, మాజీ ఎంపీటీసీ పెద్దలు,బండ శ్రీశైలం, ప్యారారం రాములు, కలీం,అనిల్ కుమార్,మహేష్,కె సాయి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -