నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన యువ కవి ధారా శ్రీకాంత్ కు హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రముఖ జాతీయ సోషల్ మీడియా గ్రూప్ కవి ఏడవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రముఖ లోక కవి అందెశ్రీ గారు ఫిలిం సెక్రటరీ పొన్నం రవీంద్ర, ప్రముఖ సినీ గేయ రచయిత మౌనశ్రీ మాలిక్, అడ్మిన్ ముఖ్యమైన సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన కవులు కవయిత్రులు, ఎన్నో కవితలు రాసిన రాస్తున్న మంచి యువకవి దారా శ్రీకాంత్ కు శాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించారు. ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలో మట్టిలో మాణిక్యం ధారా శ్రీకాంత్ అని ప్రశంసల వర్షం కురిపించారు. ఏజెన్సీలో ఎన్నో కవితలు రాసారని, సమాచాన్ని జాగృతి పరిచే విధంగా కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సినీగే రచయిత మౌనశ్రీ, మాలిక్ గ్రూప్ అడ్మిన్ ముఖ్యర సంపత్ కుమార్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కవులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.