- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. చిట్యాల రహదారిలోని పడిగాపుర్, తాళ్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిట్యాల గ్రామానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు, ఓ యువకుడు బైక్ పై కన్నాయిగూడెం వైపు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో బొచ్చు సింధుజ (17) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -