నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లాలో నిరుపేద యువతీ, యువకులు, ప్రజలు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహన నియమ నిబంధనలు పాటించడానికి ప్రత్యేకంగా జిల్లా పోలీసు యంత్రాంగం తరపున మొదటి విడత 5 మండలాలలో మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5 మండలాలు నార్నూర్, గాదిగూడ, బజార్హత్నూర్, సిరికొండ, భీంపూర్ లలో యువత, ప్రజలు తమ యొక్క ఆధార్ కార్డు మరియు అడ్రస్ ప్రూఫ్ లేదా టెన్త్ క్లాస్ మెమో జిరాక్సులను సంబంధిత పోలీసు స్టేషన్లలో అందించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వీరూ మొదటగా ఆన్లైన్ నందు లేదా, మీసేవ కేంద్రాల్లో లర్నింగ్ లైసెన్స్ కై రూ.600 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తదుపరి లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత నెల రోజుల నుండి ఆరు నెలల లోపు పర్మినెంట్ లైసెన్స్ కొరకు రూ.1200 రుసుమును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా ను ప్రజలు, యువత పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత ప్రజలు వాహన నియమనిబంధనలు పాటించాలని ప్రమాదాలకు గురి కాకుండా లైసెన్సులు నియమాలు ఉపయోగపడతాయని సూచించారు.
మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళకు యువతకు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES