Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలి

- Advertisement -

– బాల్కొండ ఎస్ఐ బి.నరేష్ 
నవతెలంగాణ – బాల్కొండ : డ్రగ్స్ నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని బాల్కొండ ఎస్ఐ బి.నరేష్ అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం లో భాగంగా మండల కేంద్రంలో గురువారం 2 కె రన్,  భారీ ర్యాలీ నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ .. మాదక ద్రవ్యాల బారిన పడిన విద్యార్థుల జీవితాలు నరక ప్రాయంగా ఉంటాయని, జీవితంలో సర్వస్వం కోల్పోవలసి వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, అన్ని విద్యాసంస్థల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -