నవతెలంగాణ – భిక్కనూర్
యూత్ ఫెస్ట్ 2025 లో భాగంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో 5K రెడ్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాధిక మాట్లాడుతూ యువతలో హెచ్ఐవి/ ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సౌత్ క్యాంపస్లో 5K రెడ్ రన్ జెండా ఊపి ప్రారంభించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, హెచ్ఒడి సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ డాక్టర్ అంజయ్య , జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ ప్రోగ్రాం మేనేజర్ చల్ల సుధాకర్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జ్యోతి, రాణి, దివ్య, రుచిత, బాలకృష్ణ, సాయి, క్యాంపస్ సిబ్బంది పాల్గొన్నారు.
యువత హెచ్ఐవి,ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES