యువకులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలి

– చింతలఠాన లో ముగిసిన క్రికెట్ పోటీలు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
యువకులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ యువతకు పిలపునిచ్చారు. చింతలఠాన గ్రామంలో కాంగ్రెస్ నేత బస్వపూర్ ఉప సర్పంచ్ సత్తు శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఆదివారం ముగిసాయి. విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో యువత కీలకపాత్ర వహించాలన్నారు.గ్రామ యువత ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయడంలో భాగసౌమ్యం కావాలని పిలుపునిచ్చారు.క్రికెట్ పోటీలో పాల్గొనీ  మొదటి,ద్వితీయ స్థానంలో నిలిచిన విజేతలకు మేమొంటోస్ తో పాటు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాజు,కిషాన్ సెల్ అద్యక్షుడు పర్షరాములు,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు), ఎన్ఎస్ యీఐ జిల్లా అద్యక్షుడు సాయి ప్రసాద్,జిల్లా కాంగ్రెస్ హ్యుమన్ రైట్స్ అద్యక్షుడు గుగ్గిళ్ళ భరత్ గౌడ్,సీనియర్ నాయకులు మాందాటి తిరుపతి యాదవ్,చరణ్ యాదవ్,యువకులు, పాల్గొన్నారు.

Spread the love