- Advertisement -
హైదరాబాద్ : పోటీతత్వం, ఒత్తిడితో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని క్లాస్రూమ్ వాతావరణంలో సాంకేతికత ఆధారిత అభ్యాసం అందించాలని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఐఐటీ జెఈఈ, నీట్ పరీక్షల బోధనకు ఏర్పాటు చేసిన బిగ్ అకాడమీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న యువరాజ్ సింగ్ మంగళవారం ఆ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి.వి ఆనంద్, సినీ నటులు బ్రహ్మానందం, బిగ్ అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



