Tuesday, June 3, 2025
E-PAPER
Homeకరీంనగర్సబ్సిడీపై జనుము, జీలుగా విత్తనాలు: ఎమ్ఏఓ రమేష్

సబ్సిడీపై జనుము, జీలుగా విత్తనాలు: ఎమ్ఏఓ రమేష్

- Advertisement -

నవతెలంగాణ – శామీర్ పేట:  సబ్సిడీపై జనుము జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శామీర్ పేట మండల వ్యవసాయ అధికారి సిహెచ్ రమేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.  పచ్చిరొట్ట విత్తనాలు వేయడం వలన భూమి సారవంతం పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయని తెలిపారు.  పచ్చిరొట్ట ఎరువులు జనుము, జీలుగా విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని, జనుము 40 కిలోల బస్తా పూర్తి ధర రూ.5020/- , సబ్సిడీ రూ.2510/- రైతు ధర రూ.2510/- రేటుకు అందిస్తున్నాము. జీలుగా 30 కిలోల బస్తా ధర రూ.4276/-  సబ్సిడీ రూ.2138/- రైతు ధర రూ.2138/- అందుబాటులో ఉందని తెలిపారు.  విత్తనాలు తీసుకోవాలనుకునే రైతులు తమ  పట్టాపాస్తు పుస్తకం, ఆధార్ జిరాక్స్ కాపీలతో  ఏమ్ఏఓ లను సంప్రదించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -