నవతెలంగాణ – శామీర్ పేట: సబ్సిడీపై జనుము జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శామీర్ పేట మండల వ్యవసాయ అధికారి సిహెచ్ రమేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలు వేయడం వలన భూమి సారవంతం పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువులు జనుము, జీలుగా విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని, జనుము 40 కిలోల బస్తా పూర్తి ధర రూ.5020/- , సబ్సిడీ రూ.2510/- రైతు ధర రూ.2510/- రేటుకు అందిస్తున్నాము. జీలుగా 30 కిలోల బస్తా ధర రూ.4276/- సబ్సిడీ రూ.2138/- రైతు ధర రూ.2138/- అందుబాటులో ఉందని తెలిపారు. విత్తనాలు తీసుకోవాలనుకునే రైతులు తమ పట్టాపాస్తు పుస్తకం, ఆధార్ జిరాక్స్ కాపీలతో ఏమ్ఏఓ లను సంప్రదించాలని తెలిపారు.
సబ్సిడీపై జనుము, జీలుగా విత్తనాలు: ఎమ్ఏఓ రమేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES