Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపారిశ్రామికాభివృద్ధిలో జీటో సేవలు మరువలేనివి

పారిశ్రామికాభివృద్ధిలో జీటో సేవలు మరువలేనివి

- Advertisement -

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
తెలంగాణలో విరివిగా పెట్టుబడులు పెట్టండి
మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన జీటో కనెక్ట్‌ 2025 ఎగ్జిబిషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వ్యాపార, వాణిజ్య, విద్యా రంగాల్లో జైన సమాజం పాత్ర మరువలేనిదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో మూడు రోజుల పాటు జరగనున్న ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జీటో) కనెక్ట్‌ 2025 ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రకృతి వనరులు సంక్షోభంలో ఉన్న ఈ రోజుల్లో జైన తత్వం నియంత్రణ మార్గాన్ని చూపిస్తుందన్నారు. ఆధ్యాత్మికత, వ్యాపార, విద్యా రంగాలు ఎదగడానికి జీటో కనెక్ట్‌ వేదికగా మారిందన్నారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విలువలతో కూడిన అభివృద్థికి చిరునామాగా తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచిందని అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల ను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచనా తీరు కూడా మారిందని అభిప్రాయప డ్డారు.

జైన సమాజం ‘సేవా’ స్ఫూర్తిని, తెలంగాణ ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌తో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందని చెప్పారు. నిజమైన యూనికార్న్‌ అంటే బిలియన్‌ డాలర్ల విలువ కాదనీ, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడమని యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌రావు, జీటో హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రతినిధులు రోహిత్‌ కొఠారి, లలిత్‌ చోప్రా, విశాల్‌ అంచాలియా, బీఎల్‌ భండారీ, సుశీల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -