నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను జడ్పీ సీఈవో శోభారాణి పరిశీలించారు. బుధవారం ఆమె హనుమపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పారిశుద్ధ పనులను, విద్యార్థులకు నీటి వసతి పాఠ్యపుస్తకాలను, మౌలిక వసతులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలో 39 ఇండ్లకు గాని 25 ఇండ్లను ప్రారంభించగా, వాటిని పరిశీలించి తొందరగా పూర్తి చేయాలని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు మొక్కలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నర్సరీలో కమ్యూనిటీ ప్లాంటేషన్ పరిశీలించారు. రైతులకు ఉపయోగపడే విధంగా మునగ మొక్కలను పెంచాలని సూచించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి శివారెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జడ్పీ సీఈవో శోభారాణి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES