Wednesday, April 30, 2025
Homeసినిమాఓటీటీలోనూ విశేష ఆదరణ

ఓటీటీలోనూ విశేష ఆదరణ

చిమటా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చిమటా రమేష్‌ బాబు (సి.హెచ్‌.ఆర్‌) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్‌.ఏ) సమర్పణలో, చిమటా లక్ష్మీ కుమారి నిర్మించారు. గత ఏడాది ఆగస్టు 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 16 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. 99 రూపాయల రెంట్‌తో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ రాబట్టుకుంది. లవ్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ,కామెడీ, హర్రర్‌ తో పాటు అన్ని ఎలిమెంట్స్‌తో మల్టీ జోనర్‌ మూవీగా చిమటా రమేష్‌ బాబు (సి.హెచ్‌.ఆర్‌) ఈ చిత్రాన్ని రూపొందించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు. జానీ పాత్రలో రమేష్‌ బాబు నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. జానీ అన్యాయాలను ఎదురించే యువకుడిగా, అపదలో ఉన్న వారికి సాయం చేసే వ్యక్తిగా నటించారు. అయితే ఓ విషయంలో తను శత్రువులతో పోరాడాల్సి వస్తుంది. అదే టైమ్‌లో జానీ లైఫ్‌లోకి కీర్తన వస్తుంది. ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారుతుంది. కీర్తన ప్రమాదంలో ఉన్న విషయం జానీకి తెలుస్తుంది. ఆ ప్రమాదం నుంచి కీర్తను జానీ ఎలా బయటకు తీసుకువచ్చాడనేది చాలా ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కులు మనాలిలో చిత్రీకరించిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ హైలైట్‌ గా ఉన్నాయి. ఊహించని మలుపులతో కథను హర్రర్‌ వైపుకు తీసుకెళ్ళాడు దర్శకుడు. రిషిత, మేఘన హీరోయిన్లుగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ఐఎమ్‌డీబీలో 8.9 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. బుక్‌మైషోలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img