నవతెలంగాణ – హైదరాబాద్: పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా దాయాది పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ చర్యలు ఉంటాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పహల్గామ్ పాశవిక దాడి ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ అని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణమంత్రి అంగీకరించారని గుర్తుచేశారు. కానీ, తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని అన్నారు.
- Advertisement -