నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా అభివృద్ధి బ్యాంక్(ADB) ను ఆర్థిక మంత్రి కీలక డిమాండ్ చేశారు. పాకిస్థాన్ దేశానికి ఆర్థిక నిధులు తగ్గించాలన్నారు. ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన 58వ ADB వార్షిక సమావేశంలో నిర్మలా సీతారామన్ ADB అధ్యక్షుడు మసాటో కందాతో సమావేశమయ్యారు. ఏప్రీల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాక్ హస్తముందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్పై తగిన చర్యలు తీసుకోవాలని..అంతర్జాతీయ వేదికలపై ఇండియన్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది. తాజాగా మిలాన్ వేదికగా జరుగుతున్న ADB వార్షిక సమావేశంలో పహల్గాం అంశాన్ని లెవనెత్తారు.
పాక్కు ADB ఆర్థిక నిధులు తగ్గించాలి: నిర్మలా సీతారామన్
- Advertisement -
- Advertisement -