Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంపోప్ ఫ్రాన్సిస్‌ అంతిమ యాత్ర‌లో అశేష జ‌నం

పోప్ ఫ్రాన్సిస్‌ అంతిమ యాత్ర‌లో అశేష జ‌నం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: క్యాథ‌లిక్ క్రైస్తవ మ‌ఠాధిప‌తి పోప్ ఫ్రాన్సిస్ సోమ‌వారం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. స్ట్రోక్‌తో పాటు హృద్రోగ సంబంధిత స‌మ‌స్య వ‌ల్ల పోప్ ఫ్రాన్సిస్ ప్రాణాలు విడిచిన‌ట్లు వాటిక‌న్ డాక్టర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోప్‌ అంత్యక్రియలు నిర్వహించారు. వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో అంత్యక్రియలు జ‌రిగాయి. పోప్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు ల‌క్ష‌ల మంది ఆయ‌న అంతిమ యాత్ర‌లో పాల్గొన్నారు.పోప్‌ అంత్యక్రియల్లో ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఇక భారత్‌ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఈ మేరకు ముర్ము నిన్న వాటికన్‌ సిటీకి బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతితోపాటు కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు, కేంద్ర స‌హాయ మంత్రి జార్జ్ కురియ‌న్‌, గోవా డిప్యూటీ స్పీక‌ర్ జోష‌వ‌ పీట‌ర్ డిసౌజా కూడా వెళ్లారు. పోప్ అంతిమ యాత్ర‌లో లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి పోప్‌కు కడసాని నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img