Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సేవే లక్ష్యం.. మానవత్వమే మార్గం..

ప్రజా సేవే లక్ష్యం.. మానవత్వమే మార్గం..

- Advertisement -

– బాధిత కుటుంబాలను ఆదుకోవడం నా బాధ్యత
– ఎర్రబెల్లి సూచనలతో మరిన్ని సేవా కార్యక్రమాలు
– గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించాలి
నవతెలంగాణ – రాయపర్తి
ప్రజా సేవే లక్ష్యం.. మానవత్వమే మార్గంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  శుక్రవారం మండలంలోని వెంకటేశ్వర పల్లి, సన్నూరు, కొండాపురం, ఉకల్, ఏకే తండా, కొత్తూరు, పెర్కవేడు, రాయపర్తి, విద్య నగర్ తండా, దుబ్బ తండా, శివరామ పురం, కాట్రపల్లి గ్రామాల్లోని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందచేశారు. యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… రాయపర్తి మండల వ్యాప్తంగా ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడం నా వంతు బాధ్యతగా భావించి ఆర్థిక సహాయాలు చేస్తూ పరామర్శించడం జరుగుతుందని తెలిపారు. బాధిత కుటుంబాలలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తులు అకాల మరణం చెందడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉండడం బాధాకరమన్నారు. అలాంటి కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనలతో మరిన్ని సేవా కార్యక్రమాలకు పురాణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. ప్రజాక్షేత్రంలో నిర్విరామ సేవకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అడుగుజాడల్లో ప్రయాణించడం జరుగుతుందని ఉపోద్ఘాటించారు. ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను రోజురోజుకు విస్తృతం చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ప్రజాసేవ చేయడం జరుగుతుందని వివరించారు. 

యువత క్రీడల్లో రాణించాలి..

గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించడానికి యువతకు క్రికెట్ కిట్లు అందించడం జరిగింది అన్నారు. శారీరకంగా, మానసికంగా దృడంగా ఉండే యువకులు క్రీడల్లో రాణించే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయన్నారు. ఆటలతో గ్రామాల యువత మధ్య స్నేహాభావం పెంపొతుంది అన్నారు. గతంలో ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్లమెంట్ లో వందల మంది యువత పాల్గొన్నారు అని చెప్పారు. యువత సన్మార్గంలో నడిచి  భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేతకుల రంగా రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్, నాయకులు తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, బద్దం వేణుగోపాల్ రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, పరుపాటి రవీందర్ రెడ్డి, గారె నర్సయ్య, ఐత రాంచందర్, పెరటి యాదవ రెడ్డి, గజావెల్లి ప్రసాద్, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, చందు సతీష్, చిలువేరు సాయి గౌడ్, ఉబ్బని సింహాద్రి, పెద్దగోని జీవన్, చందు లక్ష్మన్, జాటోత్ అనిల్, దికొండ సంతోష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -