నవతెలంగాణ-హైదరాబాద్: భారతీయులందరూ ఐక్యంగా ఉండటం అవసరమని.. తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని, దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. శ్రీనగర్లో పర్యటించిన రాహుల్.. లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో భేటీ కావడంతోపాటు ఉగ్రదాడి బాధితులను కలిసి భరోసా ఇచ్చారు. కశ్మీర్తోపాటు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కొందరు దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. మనమంతా ఐక్యంగా ఉండి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితోనూ భేటీ అయ్యా. ఏం జరిగిందో వారు వివరించారు. తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని వారిద్దరికీ హామీ ఇచ్చానని రాహుల్ గాంధీ చెప్పారు.
భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి: రాహుల్ గాంధీ
- Advertisement -
RELATED ARTICLES