- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వచ్చే నెల 5న రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ లో నిర్మించిన గోల్నాక, BHEL ఫ్లైఓవర్లు, ఆరాంఘర్-శంషాబాద్ మధ్య విస్తరించిన హైవేను ప్రారంభిస్తారు. అలాగే నల్గొండ చుట్టూ రూ.516 కోట్లతో నిర్మించనున్న రింగ్ రోడ్డుకు, హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
- Advertisement -