నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ తమిళ నటుడు సూర్య తన తదుపరి చిత్రాన్ని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శనివారం హైదరాబాద్లో జరిగిన తన తదుపరి చిత్రం ‘రెట్రో’ ప్రీ-రిలీజ్ వేడుకలో సూర్య ఈ విషయాన్ని వెల్లడించారు. “ఈ రోజు నేనొక విషయం చెప్పాలి. ఈ ప్రయాణం అల్లు అరవింద్తో మొదలైంది. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ, నా సోదరుడు వెంకీతో కలుస్తున్నాం. ఇదే నా తదుపరి చిత్రమని అన్నారు. మే నెల నుంచి మా ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఇకపై హైదరాబాద్లో ఎక్కువ సమయం గడుపుతాను, ఇక్కడే ఎక్కువ షూటింగ్ ఉంటుంది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలి. ఇది కచ్చితంగా ఒక అందమైన ప్రయాణం అవుతుందని నమ్ముతున్నాను” అని తెలిపారు. దుల్కర్ సల్మాన్తో వెంకీ అట్లూరి ఇటీవల తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
వెంకీ అట్లూరితో కొత్త సినిమా ప్రకటించిన సూర్య
- Advertisement -
RELATED ARTICLES