- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గొర్రెలు మృతి చెందిన ఘటన రామారెడ్డి శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇసన్న పల్లి గ్రామ సర్పంచ్ డోకి లచ్చయ్యకు చెందిన గొర్రెల మంద మేతకు వెళ్తున్న క్రమంలో రామారెడ్డి శివారులో అన్నారం నుండి కామారెడ్డి వస్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెల మందను ఢీకొనడంతో 7 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.
- Advertisement -



