- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను శనివారం డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా పర్యవేక్షించారు. ఉప సాగు కాల్వ లోతు పెంచాలని డీఆర్డీఓ సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఓ సందర్శించి రైతులకు సౌకర్యాలు ఏర్పాటుచేయాలని అధేశించారు.ఎంపీడీఓ ప్రవీన్,సర్పంచ్ బీమయ్య పాల్గొన్నారు.
- Advertisement -



