- Advertisement -
చెన్నై : లోక్సభలో శుక్రవారం రాజ్యాంగ (131 సవరణ) బిల్లు 2026 వీగిపోయింది. దీంతో నల్లచట్టమైన డీలిమిటేషన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. డీలిమిటషన్ అనే నల్లచట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన పోరాటం పార్లమెంటులో విజయం సాధించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. దానిని ఓడించినందుకు ఇండియా బ్లాక్ ఎంపీలకు, మహిళలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్లో వీడియో పోస్టు చేశారు.
- Advertisement -



