ప్రేక్షకుల మనసుల్ని గెలిచి, కల్ట్ క్లాసిక్ హిట్గా నిలిచిన చిత్రం ‘అందాల రాక్షసి’. ఈ సినిమా మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్ గ్రీన్ లవ్స్టోరీ ఈనెల 13న రీ- రిలీజ్ కాబోతోంది.
నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హను రాఘవ పూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10, 2012న విడుదలై ఘన విజయాన్ని సాధించింది.
భిన్నమైన ప్రేమ కథ, లోతైన భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు హను రాఘవపూడి. రధన్ మ్యూజిక్ ఎవర్ గ్రీన్గా నిలిచింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ మ్యాజిక్ మళ్లీ బిగ్ స్క్రీన్ పై మరోసారి ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు.
ఎటువంటి అంచనాలు లేకుండా విడుద లైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజ యం సాధించింది. నవీన్చంద్ర, లావణ్య త్రిపాఠి, రాహుల్రవీంద్రన్ పాత్రలు అం దర్నీ మెస్మరైజ్ చేశాయి. ముఖ్యంగా కథ, కథానాన్ని దర్శకుడు హనురాఘవ పూడి అద్భుతంగా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు బెస్ట్ అవుట్ఫుట్ ఇచ్చారు. రీ-రిలీజ్లోనూ సినిమా అందర్నీ అలరిస్తుంది అని మేకర్స్ దీమా వ్యక్తం చేశారు.
‘అందాల రాక్షసి’ రీ-రిలీజ్కి రెడీ
- Advertisement -
- Advertisement -